మునుగోడు లో లక్ష మందితో కేసీఆర్ భారీ బహిరంగ సభ..

మునుగోడు ఉప ఎన్నిక ప్రచార సమయం ముగుస్తుండడంతో అన్ని పార్టీల ప్రధాన నేతలు మునుగోడు లో ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. అధికార పార్టీ టిఆర్ఎస్ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్..మునుగోడు లో లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈనెల 30న చండూరులో కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈ సభకు ఏకంగా లక్ష మంది వస్తారని సమాచారం. టిఆర్ఎస్ నేతలు ఇప్పటికే కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లలో మునిగిపోయారు. ఆ తర్వాత రోజే జేపీ నడ్డా రానుండటంతో మునుగోడు ఉప ఎన్నికల హీట్ మరింత పెరిగే అవకాశం ఉంది. కేసీఆర్ చేసే విమర్శలకు నడ్డా కౌంటర్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

మరోపక్క టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తరఫున మంత్రి జగదీశ్ రెడ్డి మునుగోడులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సంక్షేమ పథకాలు కావాలంటే టీఆర్‌ఎస్‌కు, వద్దనుకుంటే బీజేపీకి ఓటు వేయాలని నియోజకవర్గ ప్రజలకు సూచించారు. ఈ ఎన్నిక కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి మధ్య జరుగుతున్నది కాదని., సంక్షేమ పథకాలు కావాలా.. వద్దా.. అన్న ఆంశపై జరుగుతున్న ఎన్నిక అని అన్నారు.