మహారాష్ట్ర బస్సు దుర్ఘటన.. సిఎం కెసిఆర్ సంతాపం
హైదరాబాద్: మహారాష్ట్రలో ఈరోజు తెల్లవారుజామున సమృద్ధి-మహామార్గ్ ఎక్స్ప్రెస్వేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 మంది సజీవదహనమైన విషయం తెలిసిందే. ఆ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, సిఎం కెసిఆర్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
బస్సు డ్రైవర్ను, కండక్టర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు మహారాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్ తెలిపారు. బస్సు టైరు పేలడం వల్ల ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉందని పోలీసులు వెల్లడించారు. ప్రయాణికులు నిద్రలో ఉన్న కారణంగా 25 మంది సజీవ దహనం అయ్యారు. బోల్తా కొట్టిన బస్సు డీజిల్ ట్యాంక్ లీకైందని, దాని వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.