బిఆర్ఎస్ లో చేరడం ఫై కాసాని జ్ఞానేశ్వర్ క్లారిటీ

తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్..బిఆర్ఎస్ లో చేరబోతున్నట్లు గత మూడు రోజులుగా మీడియా లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ వార్తలు చూసి చాలామంది నిజమే కావొచ్చు అని అభిప్రాయానికి వచ్చారు. ఈ తరుణంలో ఈ వార్తలపై కాసాని జ్ఞానేశ్వర్ క్లారిటీ ఇచ్చారు. తనకు ఏ పార్టీ నుంచి పిలుపు రాలేదన్నారు. తన దృష్టిలో తెలంగాణలో టీడీపీ (TDP) మాత్రమే బెస్ట్ అని అన్నారు. దీంతో పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారానికి ఆయన చెక్ పెట్టారు. ఈ రోజు చంద్రబాబుతో ఆయన ములాఖత్ అయ్యారు.

రానున్న ఎన్నికల్లో తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు జ్ఞానేశ్వర్. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదన్నారు. రేపు ఉదయం లోకేష్ తో మరోసారి మాట్లాడిన తర్వాత ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలంగాణలో టీడీపీ అన్ని స్థానాల్లోనూ బలంగానే ఉందన్నారు.