ఢిల్లీ కాంగ్రెస్ కార్యాలయంలో మొదలైన సంబరాలు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా దూసుకపోతుండడం తో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం దగ్గర పార్టీ నేతలు, కార్యకర్తలు మిఠాయిలు పంచుకుంటూ సంతోషాన్ని పంచుకుంటున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ (113) కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో ఉండటంతో ఆ పార్టీ నేతల్లో జోష్ వచ్చింది.. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో దూసుకుపోతుండటం ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ 117 స్థానాల్లో లీడ్ లో ఉండగా… బీజేపీ 73, జేడీఎస్ 29, ఇతరులు 5 సీట్లలో లీడ్ లో ఉన్నారు.