కర్ణాటకలో మంత్రివర్గం విస్తరణ

మంత్రులుగా10 మంది రెబల్స్‌కు కేబినెట్‌లో చోటు

Karnataka cabinet
Karnataka cabinet

బెంగళూరు: కర్ణాటక సిఎం యడియూరప్ప ఆరు నెలల తర్వాత మళ్లీ తన కేబినెట్‌ను విస్తరించారు. తాజాగా 10 మంది రెబల్స్‌కు కేబినెట్‌లో చోటు కల్పించారు. ఈ సందర్భంగా కొత్త మంత్రులతో గవర్నర్‌ వాజుభాయ్‌వాలా ప్రమాణం చేయించారు. కాగా పార్టీ మారడంతో అనర్హత వేటుకు గురై తిరిగి ఎన్నికైన సోమశేఖర్‌, రమేష్, ఆనంద్‌సింగ్‌, సుధాకర్‌, బసవరాజ్‌ అరబెయిల్‌ హెబ్బర్‌ శివరాం, హసవనగౌడ, గోపాలయ్య, నారాయణగౌడ, శ్రీమంత్‌ పాటిల్‌ తదితరులకు మంత్రి పదవులు దక్కాయి. అయితే కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నుంచి బయటికి వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలు సహా మొత్తం 13 మంది గురువారం మంత్రులుగా ప్రమాణం చేస్తారంటూ ఆదివారం యడియూరప్ప ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/