టిడిపి ఆవిర్భావ వేడుకలపై జేపీ నడ్డా హర్షం

టిడిపి ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న నడ్డా

JP Nadda

న్యూఢిల్లీః టిడిపి ఆవిర్భావ వేడుక ల్లో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. ఆ వేడుకలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. అయితే పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ ఆవిర్భావ వేడుకలను టిడిపి ఎంపీలు గల్లా జయదేవ్ , కేశినేని నాని , కనకమేడల రవీందర్ నిర్వహించారు. కేక్ కట్ చేసి ఇతర పార్టీల ఎంపీలకు టిడిపి ఎంపీలు అందజేశారు. ఆవిర్భావ వేడుకలు జరుగుతున్న సమయంలో జేపీ నడ్డా సైతం అక్కడకు చేరుకున్నారు. టిడిపి ఎంపీలకు అభినందనలను తెలియజేశారు. వాజ్ పేయి, ఎన్‌డీఏ హయాంలో టిడిపి, బిజెపి ల మధ్య అనుబంధాన్ని ఎంపీ కనకమేడల.. నడ్డాకు వివరించారు. అయితే తనకు టిడిపితో స్నేహ సంబంధాల గురించి తెలుసని నడ్డా పేర్కొన్నారు. ఇటీవల అండమాన్ మేయర్ ఎన్నికల్లో టిడిపి, బిజెపి పొత్తుపైనా నడ్డా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. తమ అభ్యర్ధుల విజయంపైనా సైతం ట్విట్టర్‌లో హర్షం వ్యక్తం చేశారు.