ఏపీలో రూ.10 వేల కోట్ల పెట్టుబ‌డులు పెట్టబోతున్నాం – నవీన్ జిందాల్

ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గొన్న జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ చైర్మ‌న్‌ నవీన్ జిందాల్.. ఏపీలో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు తెలిపారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గొనడం చాలా గ‌ర్వంగా ఉందని తెలిపారు. ఏపీ శ్రీ‌వేంకటేశ్వర స్వామి వారి పుణ్యభూమి అని , ఏపీలో పనిచేసిన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకోవడానికి నేను సంతోషిస్తున్నా. ఏపీ ఇన్‌ఫ్రా బేస్‌, వ్యాపార అనుకూల వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. ప్రోగ్రెసివ్ పాలసీ, పెట్టుబడిదారులకు అనుకూలమైన స్థలాన్ని సృష్టించే సింగిల్ విండో పాలసీని రూపొందించిన జగన్ ప్రభుత్వానికి జిందాల్ గ్రూప్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.

ఇంత‌కు ముందే ఏపీలో ఒక యూనిట్‌ను ప్రారంభించామ‌ని చెప్ప‌డానికి సంతోషిస్తున్నాను. మ‌రో యూనిట్‌ను కూడా ప్రారంభించ‌నున్నాం. 6 నెలల్లో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి అందించనున్నాం. కృష్ణ‌ప‌ట్నం స‌మీపంలో 3 మిలియ‌న్ ట‌న్నుల స్టీల్ ప్లాంట్‌ను రూ.10 వేల కోట్లతో స్థాపించ‌బోతున్నాం. దీని ద్వారా ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా 10 వేల మందికి పైగా ఉపాధి ల‌భించ‌నుంది. ఈరోజు ప్ర‌భుత్వంతో ఎంవోయూ కూడా కుదుర్చుకోనున్నాం అని తెలిపారు.