బండి సంజయ్ పాదయాత్ర లో జీవితరాజశేఖర్ దంపతులు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర ఈరోజు 11వ రోజు కొనసాగుతోంది. ఈ క్రమంలో జీవిత రాజశేఖర్ సంజయ్ తో కలిసి పాదయాత్ర చేసారు. జీవితతో పాటు ఆమె భర్త రాజశేఖర్ కూడా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. వీరిద్దరూ ఈమధ్య కాలంలోనే బిజెపి పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.

ఈరోజు బండి సంజయ్ నార్కట్ పల్లి మండలం అమ్మనబోలు శివారులో పాదయాత్రను ప్రారంభించారు. నకిరేకల్ నినియోజకవర్గం నుంచి తుంగతుర్తి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించింది. తుంగతుర్తి నియోజకవర్గంలోకి ప్రవేశించిన సందర్భంగా బీజేపీ కార్యకర్తలు బండి సంజయ్ కు ఘన స్వాగతం పలికారు.

తుంగతుర్తి నియోజకవర్గంలోని పొడుచేడు, అనాజీపురం, బుజ్జిలపురం, ధర్మపురం మీదుగా మోత్కూర్ వరకు పాదయాత్ర కొనసాగనుంది. మునుగోడు ఉప ఎన్నిక ముంచుకొస్తున్న తరుణంలో ఇదే జిల్లాలో కొనసాగుతున్న బీజేపీ ప్రజాసంగ్రామ యాత్ర అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక ఇది ఇలా ఉండగా…‘‘హర్ ఘర్ తిరంగా జెండా‘‘లో భాగంగా అమ్మనబోలులోని ప్రజా సంగ్రామ యాత్ర శిబిరం వద్ద మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. జాతీయ జెండా ఆవిష్కరణలో పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు పీవీ శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.