గురజాల టీడీపీ MLA అభ్యర్థిగా జంగా?

పల్నాడు జిల్లా గురజాల టీడీపీ MLA అభ్యర్థిగా వైసీపీ మ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. త్వరలో ఆయన టీడీపీలో చేరుతున్నట్లు సమాచారం. యరపతినేని శ్రీనివాసరావుకు నరసరావుపేట అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని అధిష్ఠానం సూచించినట్లు తెలుస్తోంది. ఇక మైలవరం టీడీపీ టికెట్ వసంత కృష్ణప్రసాద్ కు ఖరారైనట్లు సమాచారం. ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న దేవినేని ఉమాను పెనమలూరు నుంచి పోటీ చేయించే ఛాన్స్ ఉన్నట్లు టాక్.

ఏపీలో ఈసారి టిడిపి జనసేన తో పొత్తు పెట్టుకోవడం తో చాల స్థానాలు వదులుకోవాల్సి వచ్చింది. దీంతో కొంతమంది నేతలను మార్చడం , టికెట్ రాని నేతలను బుజ్జగించడం చేస్తున్నారు. ఇక జనసేన లో ఆగ్రహపు జ్వాలలు తారాస్థాయికి చేరుతున్నాయి. కేవలం 24 స్థానాల్లోనే జనసేన బరిలోకి దిగబోతున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించడం..జనసేన కీలక నేతలు ఉన్న స్థానాల్లో టిడిపి అభ్యర్థులకు టికెట్ ఇవ్వడం తో వారంతా తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో పార్టీ కి రాజీనామా చేసి వైసీపీ లో చేరుతున్నారు. మరికొంతమంది మాత్రం టిడిపి కి సపోర్ట్ చేసేదే లేదని తేల్చి చెపుతున్నారు.