రేవంత్ ఫై జగ్గారెడ్డి ఫైర్..రేవంత్‌కు విలువే లేదు అంటూ నిప్పులు

jagga reddy

జగ్గారెడ్డి – రేవంత్ మంచి దోస్తులు అయ్యారు..ఇక వాళ్లు విడిపోరు..అని కాంగ్రెస్ నేతలు , కార్య కర్తలు అనుకున్నారో లేదో..ఈరోజు జగ్గారెడ్డి రేవంత్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..పదవి లేకుంటే రేవంత్‌కు విలువే లేదు..పీసీసీ నుంచి రేవంత్‌ను తొలగించమని హైకమాండ్‌కు లేఖ రాస్తా.. రేవంత్‌రెడ్డి లేకపోయినా పార్టీని నడిపిస్తా’మని జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు.

అసలు ఏంజరిగిందంటే..

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యాశ్వంత్ సిన్హా ఈరోజు హైదరాబాద్ కు వచ్చారు. ఈ తరుణంలో టిఆర్ఎస్ పార్టీ ఆయనకు గ్రాండ్ వెల్ కామ్ చెప్పింది. కాగా కేసీఆర్ ను కలిసిన వ్యక్తి తో మేము కలిసేది లేదని రేవంత్ చెప్పడం తో కాంగ్రెస్ నేతలెవరూ ఆయన్ను కలవలేదు. అయితే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ హనుమంతరావు మాత్రం సిన్హాను కలిశారు. దీంతో వీహెచ్‌ వ్యవహారంపై రేవంత్‌ రెడ్డి సీరియస్‌ అయ్యారు. పార్టీ నిర్ణయం కాదని వ్యక్తిగతంగా మాట్లాడితే గోడకేసి కొడతామని వ్యాఖ్యానించారు. ఇది పిల్లలాట కాదని.. పార్టీ వ్యవహారమని అన్నారు. కేసీఆర్‌ ఇంటికి వచ్చిన వాళ్లను మనం వెళ్లి ఎందుకు కలవాలని ప్రశ్నించారు. మన ఇంటికి వచ్చినప్పుడు మనం కలవాలని సూచించారు.

రేవంత్ కామెంట్స్ ఫై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. సిన్హాకు కాంగ్రెస్‌ అధిష్టానం మద్దతు తెలిపిందని, రాహుల్‌కు లేని అభ్యంతరం పీసీసీ చీఫ్‌కు ఎందుకని ప్రశ్నించారు. సిన్హా నామినేషన్‌ రోజు రాహుల్‌ పక్కన కేటీఆర్‌ కూడా ఉన్నారని ప్రస్తావించారు. రేవంత్‌కు మేం నౌకర్లమా అని ప్రశ్నించారు. అంత కోపం ఉన్న వ్యక్తి పీసీసీకి ఏం పనికొస్తాడని ప్రశ్నించారు. బండకేసి కొట్టడానికి నువ్వు ఎవరూ? ఎవర్ని బండకేసి కొడతాడో చెప్పాలి. పదవి లేకుంటే రేవంత్‌కు విలువే లేదు. ఒక్క స్టేట్‌ మీటింగ్‌ లేదు.. ఇంట్లో కూర్చుంటే సరిపోతుందా. వీహెచ్‌ వయసెక్కడా.. నీ వయసెక్కడా.. నువు పొరగానివి, పీసీసీ నుంచి రేవంత్‌ను తొలగించమని హైకమాండ్‌కు లేఖ రాస్తా.. రేవంత్‌రెడ్డి లేకపోయినా పార్టీని నడిపిస్తా’మని జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యవహారంతో మరోసారి కాంగ్రెస్ పార్టీలో విభేదాలు గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.