కీలక బాధ్యతల నుంచి అమర్ నాథ్ ను తప్పించిన జగన్
ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్ నాద్ కు సీఎం జగన్ షాక్ ఇచ్చారు. ఇప్పటికే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జీగా మరొకరిని నియమించిన జగన్..ఇప్పుడు ప్రముఖలు ఆహ్వానించే బాధ్యత నుండి అమర్ నాద్ ను తప్పించారు.
అమర్ నాథ్ మంత్రి అయిన తర్వాత విశాఖకు ప్రముఖులు వచ్చే సమయంలో వారికి స్వాగతం పలికే బాధ్యతను ఆయనకు జగన్ అప్పగించారు. అయితే ఈసారి ఆ బాధ్యతను మంత్రి బూడి ముత్యాలనాయుడుకు జగన్ అప్పగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రముఖులకు స్వాగతం పలికే బాధ్యతల నుంచి కూడా అమర్ నాథ్ ను తప్పించడం వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.