తెలుగు ప్రజలకు జగన్, చంద్రబాబు క్రిస్మస్ శుభాకాంక్షలు

క్రిస్మస్ పండుగ మాత్రమే కాదు.. మనిషిని సన్మార్గంలో నడిపించే దైవిక భావన: జగన్
శాంతి, సంతోషాలకు క్రిస్మస్ చిహ్నమన్న చంద్రబాబు


అమరావతి : సీఎం జగన్ , టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తెలుగు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మిస్ పండుగ మాత్రమే కాదని, మనిషిని నిరంతరం సన్మార్గంలో నడిపించే దైవికమైన భావన అని జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రులపైనా క్షమాగుణం చూపించడం వంటివి జీసస్ తన జీవితం ద్వారా మనకు ఇచ్చిన సందేశాలని జగన్ పేర్కొన్నారు.

క్రీస్తు జన్మదినం శాంతి, సంతోషాలకు చిహ్నమని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఏసు దీవెనలు ప్రతి ఒక్కరికీ అందాలని అన్నారు. జీసస్ జీవితం స్ఫూర్తిదాయకమని, ప్రజల జీవితాల్లో నెలకొన్న బాధలు తొలగించి, ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషాలు నింపాలని ఆయనను వేడుకుంటున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలని కోరారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/