అయ్యన్న అక్రమంగానే గోడ కట్టారంటూ ఆధారాలు బయటపెట్టిన ఇరిగేషన్ శాఖ

పంట కాల్వను ఆక్రమించి గోడను నిర్మించారని, ప్రభుత్వ భూమిలోని రెండు సెంట్లు ఆక్రమించారని నర్సీపట్నం మున్సిపల్‌ కమిషనర్‌ నర్సీపట్నంలోని అయ్యనపాత్రుడి ఇంటి గోడను జేసీబీ లతో కూల్చారు. దీనిపట్ల టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నిర్వహిస్తున్న మినీమహానాడు కార్యక్రమాలకు వస్తున్న ప్రజా స్పందనను చూసి సీఎం జగన్ ఓర్వలేకపోతున్నాడని , అందుకే టీడీపీ నాయకులపై వైసీపీ ప్రభుత్వం అక్రమ అరెస్టులు, ఇల్లు కూల్చివేతలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలో అయ్యన్న అక్రమంగానే గోడ కట్టారని ఆధారాలు బయటపెట్టింది. రావణాపల్లి రిజర్వాయర్ బ్రాంచ్ ఛానెల్ నీలంపేట ఛానెల్ లో… నర్సీపట్నం పట్టణ పరిధిలోని శివపురం దగ్గర నీలంపేట ఛానెల్ కు గోడలు కట్టింది ఇరిగేషన్ శాఖ. సరిగ్గా ఈ గోడ కట్టిన చోటే మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటి నిర్మాణం చేశారు. ఇరిగేషన్ శాఖ గోడల పైనే బేస్ మెంట్ నిర్మించారు. ఛానెల్ ఒడ్డున నదిలోకి పది అడుగుల వరకు ఆక్రమించారని తేల్చారు ఇరిగేషన్ శాఖ అధికారులు. ఈ నేపథ్యంలోనే… ఆ గోడను కూల్చేసినట్లు ఏపీ ఇరిగేషన్ శాఖ వివరణ ఇచ్చింది.