15 మంది భారతీయ సిబ్బందితో ఉన్న నౌక హైజాక్
రంగంలోని ఇండియన్ నేవీ
న్యూఢిల్లీః భారతీయ సిబ్బందితో కూడిన ఓ నౌక సోమాలియా తీరంలో హైజాక్కు గురైంది. ఈ నౌకను MV LILA NORFOLగా గుర్తించినట్లు భారత నావికాదళం తెలిపింది. గురువారం సాయంత్రం ఈ నౌక హైజాక్కు గురైనట్లు తెలిపింది. లైబీరియన్ జెండా తో కూడిన ఈ షిప్లో 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్లు మిలిటరీ అధికారులను ఊటంకిస్తూ ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ వెల్లడించింది. ఆ నౌకపై నిఘా ఉంచినట్లు భారత నావికాదళ అధికారులు తెలిపారు. ఈ మేరకు పరిస్థితిని పరిష్కరించడానికి ఇండియన్ నేవీ యుద్ధనౌక ఐఎన్ఎస్.. రంగంలోకి దిగినట్లు చెప్పారు.