ఇనార్బిట్ దుర్గం చెరువు రన్ IDCR 2024 రేస్ రూట్

వెస్టిన్, మైండ్‌స్పేస్, హైదరాబాద్‌లో విడుదల చేసిన ఇనార్బిట్ దుర్గం చెరువు రన్ (IDCR) 2024.. రేస్ రూట్, అధికారిక టీ-షర్ట్, మెడల్ మరియు ఛారిటీ బిబ్..ఈ కార్యక్రమం లో శ్రీ డాక్టర్ జి వినీత్, ఐపిఎస్, డిసిపి, మాదాపూర్, శ్రీ టి శ్రీనివాసరావు, ఐపిఎస్, డిసిపి ట్రాఫిక్ తో పాటు శ్రీమతి సృజన, IPS, DCP ఉమెన్ సేఫ్టీ, శ్రీ శ్రవణ్ గొనె , COO, K రహేజా కార్ప్ సహా ప్రముఖులు హాజరయ్యారు.

Inorbit Durgam Cheruvu Run (IDCR) 2024 Launched at Westin, Mindspace, Hyderabad

హైదరాబాద్: ఇనార్బిట్ మాల్ సైబరాబాద్, మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ మరియు ది వెస్టిన్, మాదాపూర్ భాగస్వామ్యంతో త్వరలో నిర్వహించబోనున్న భారీ కార్యక్రమం , ఇనార్బిట్ దుర్గం చెరువు రన్ (IDCR) 2024 కోసం అధికారిక జెర్సీ, రేస్ రూట్, రేస్ మెడల్ మరియు ఛారిటీ బిబ్‌లను ఈరోజు ఆవిష్కరించింది. ఈ కార్యక్రమం లో శ్రీ డాక్టర్ జి వినీత్, ఐపిఎస్, డిసిపి, మాదాపూర్, శ్రీ టి శ్రీనివాసరావు, ఐపిఎస్, డిసిపి ట్రాఫిక్ తో పాటు శ్రీమతి సృజన, IPS, DCP ఉమెన్ సేఫ్టీ, శ్రీ శ్రవణ్ గొనె , COO, K రహేజా కార్ప్, శ్రీ శరత్ బెలవాడి, సెంటర్ హెడ్, ఇనార్బిట్ మాల్ హైదరాబాద్, & శ్రీ. మయూర్, వ్యవస్థాపకుడు & సీఈఓ, Nirmaan.Org. సహా ప్రముఖులు హాజరయ్యారు.

జనవరి 28, 2024న ఈ రన్ జరుగనుంది, ఈ 4వ ఎడిషన్‌ రన్ లో దేశవ్యాప్తంగా ఉన్న రన్నర్లు 21 కిమీ, 10 కిమీ, మరియు 5 కిమీల మూడు విభాగాలలో పోటీపడతారు. Nirmaan.Org ఈ సంవత్సరం CSR భాగస్వామిగా కొనసాగుతుంది, బిజినెస్ పార్క్ పార్టనర్ గా మైండ్‌స్పేస్ మరియు హాస్పిటాలిటీ పార్టనర్‌గా ది వెస్టిన్ వ్యవహరిస్తుంది. మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్‌ నుండి ప్రారంభమయ్యే ఈ రన్ మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ వద్ద ముగిసే ముందు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, దుర్గం చెరువు సరస్సు మరియు సైబరాబాద్‌లోని అనేక ఇతర అందమైన ప్రదేశాల ద్వారా సాగుతుంది.

“LGBTQ+ కమ్యూనిటీకి చెందిన సభ్యులతో పాటు ఈ రన్ లో దాదాపు 100 మంది దివ్యాంగులు కూడా పాల్గొంటారు. మొత్తం బహుమతి రూ. 6 లక్షలు కాగా , వివిధ విభాగాల్లోని 48 మంది రన్నర్‌లకు ఇది అందించబడుతుంది. ఈ పరుగు లో పాల్గొనేందుకు నమోదు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 21, 2024. దాదాపు 6500 మంది ఈ రన్ లో పాల్గొనే అవకాశం ఉంది” అని ఇనార్బిట్ మాల్ హైదరాబాద్ సెంటర్ హెడ్ శరత్ బెలవాడి తెలిపారు.

“IDCR చాలా బలమైన కారణం రన్ ఫర్ ఇంక్లూజన్ ( #runforinclusion) తో అనుబంధించబడింది. దివ్యాంగులు (పిడబ్ల్యుడిలు), బాలికలు, మహిళలు మరియు ఎల్‌జిబిటిక్యూ+ వ్యక్తులకు విద్య, నైపుణ్యం, ఉపాధి మరియు వ్యవస్థాపక అవకాశాలను పొందేందుకు సహాయం చేయడానికి నిధులను సేకరించడం ఈ రన్ లక్ష్యం. ఛారిటీ & కార్పొరేట్ భాగస్వామ్యం ద్వారా ఇప్పటివరకు రూ. 99 లక్షలు సేకరించబడ్డాయి, ఇప్పటివరకు 502 మంది లబ్ధిదారులకు మద్దతు అందించటం జరిగింది ” అని నిర్మాన్.ఓ ఆర్ జి వ్యవస్థాపకుడు & సీఈఓ మయూర్ అన్నారు.