బిట్టు శీను పోలీసుల అదుపులో
పోలీసు విచారణ
Peddapalli: హైకోర్టు న్యాయవాదుల హత్యకేసులో మంథనికి చెందిన బిట్టు శ్రీనివాస్ ను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రామగిరి మండలం కలవచర్ల వద్ద హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్ రావు ఆయన సతీమణి నాగమణి లను కుంట శ్రీనివాస్ చిరంజీవిలు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే.
వీరికి బిట్టు శీను వాహనం తోపాటు కత్తులను సమకూర్చిన బిట్టు శీను పై కేసు నమోదు చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/