కుప్ప కూలిన భారత టాప్ ఆర్డర్ – స్కోరు 19/6
ఆసీస్ బౌలర్ల నిప్పులు చెరిగే బంతులు
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న గులాబి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో భారత టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఆస్ట్రేలియా బౌలర్లు నిప్పులు చెరిగేలా వేస్తున్న బంతులకు భారత్ బ్యాట్స్ మన్ వద్ద సమాధానమే లేకుండా పోయింది.
నిన్న నైట్ వాచ్ మెన్ గా వచ్చిన బుమ్రా ఔట్ అవ్వడంతో మొదలైన వికెట్ల పతనం నిరాటంకంగా కొనసాగింది. మయాంక్ అగర్వాల్, పుజారా, కోహ్లీ, రహానే ఎవరూ కూడా కనీసం ఆసీస్ బౌలర్లను అడ్డు కోలేకపోయారు.
ఎవరూ కనీసం రెండంకల స్కోరు కూడా చేయలేదు. ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. దీంతో భారత్ రెండో ఇన్నింగ్స్ లో మూడో రోజు తొలి గంటలోనే ఐదు వికెట్లు కోల్పోయింది.
భారత్ స్కోరు 19/6. కమ్మిన్స్ 4 వికెట్లు పడగొట్టాడు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/