సీఎం జగన్‏తో భేటీ కానున్న మంచు విష్ణు

అమరావతి : టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు.. హీరో మంచు విష్ణు ఈరోజు సీఎం జగన్‏తో భేటీ కానున్నారు. మా అధ్యక్షుడిగా ఎన్నికైనా తర్వాత తొలిసారిగా సీఎం జగన్‏ని కలవబోతున్నారు. ఈ సమావేశంలో సీఎం జగన్‏తో సినీ పరిశ్రమ సమస్యలపై.. సినిమా టికెట్స్ రేట్స్ విషయం గురించి చర్చించే అవకాశం ఉంది.. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ రాజమౌళి, కొరటాల శివ, మహేష్ బాబు, ప్రభాస్, ఆర్ నారయణ మూర్తి, పోసాని..ఇతర సినీ ప్రముఖులు సీఎం జగన్‏తో సమావేశమైన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యను పరిష్కరించడానికి సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. ఈ క్రమంలో సినీ ప్రముఖుల సమావేశం అనంతరం మంచు విష్ణు.. సీఎం జగన్‏తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/