పాక్లో భారత్ ఎయిర్ అంబులెన్స్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఇస్లామాబాద్: భారత్కు చెందిన ఒక ఎయిర్ అంబులెన్స్ పాకిస్తాన్ గగనవీధుల్లోకి వెళ్లింది. వెళ్లడమే కాకుండా ఇస్లామాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా దిగేందుకు ప్రయత్నించింది. అందుకు పాకిస్తాన్ పౌర విమానాయాన అధికారుల నుంచి అనుమతి కూడా పొందింది. ఇంతకి విషయం ఏంటంటే.. బ్రిటన్కు చెందిన ఓ పేషెంట్ను తజికిస్తాన్ తీసుకెళ్తూ మార్గమధ్యంలో ఇంధనం కోసం అత్యవసరంగా పాకిస్తాన్లో మన ఎయిర్ అంబులెన్స్ హెలికాప్టర్ ల్యాండ్ అయింది.
బ్రిటన్కు చెందిన ఓ పేషెంట్ను కోల్కతా నుంచి తజికిస్తాన్ రాజధాని దుషన్బేకు తరలించేందుకు ఎయిర్ అంబులెన్స్ బయల్దేరింది. అయితే ఇంధనం తక్కువగా ఉండటంతో మార్గమధ్యంలో ఇబ్బంది రాకుండా ఉండేందుకు ముందుజాగ్రత్తగా పాకిస్తాన్లో ఇంధనం కోసం పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ అధికారులను సంప్రదించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అనుమతి తీసుకున్నారు. అనంతరం ఇస్లామాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగి ఇంధనం నింపుకుని రెండు గంటల తర్వాత కజికిస్తాన్కు బయల్దేరింది. ఇండియాకు చెందిన ఈ ఎయిర్ అంబులెన్స్లో బ్రిటన్కు చెందిన పేషెంట్తోపాటు ఒక డాక్టర్, ఇద్దరు నర్సులు ఉన్నారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ వరల్డ్ న్యూస్ వార్తగా ప్రచురించింది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/