అండర్-19 వరల్డ్ కప్: టీమిండియా టార్గెట్ 173 రన్స్
పాకిస్థాన్ ఆటగాళ్లకు దడపుట్టించిన భారత బౌలర్లు
పోచెఫ్స్ట్రూమ్(దక్షిణాఫ్రికా): అండర్-19 వన్డే ప్రపంచకప్ లో భాగంగా సెన్వెస్ పార్క్ వేదికగా జరుగుతున్న సెమీస్ లో పాకిస్తాన్, టీమిండియాకు 173 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ కు ఆదిలో బారత్ షాక్ ఇచ్చింది. కట్టుదిట్టమైన బంతులతో చెలరేగిన టీమిండియా బౌలర్లు పాక్ బ్యాట్స్ మెన్స్ కు చుక్కలు చూపించారు. దీంతో పాక్ బ్యాట్స్ మెన్స్ క్రీజులో నిలవలేక వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. పాక్ ఓపెనర్ హైదర్ అలీ(56), రోహెల్ నజీర్(62)లు మాత్రమే అర్థసెంచరీలతో రాణించారు. మిగతా ఆటగాళ్ళంతా ఘోరంగా విఫలమయ్యారు. దీంతో పాక్ జట్టు 43.1 ఓవర్లలో 172 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో శుషాంత్ మిశ్రా మూడు వికెట్లు పడగొట్టగా.. స్పిన్నర్ రవి బిష్ణ్నాయ్, కార్తిక్ త్యాగిలు చెరో రెండు వికెట్లు, అధర్వ, యశస్వీ జైశ్వాల్ లు తలో వికెట్ తీశారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/