దేశంలో నిన్న ఒక్క రోజే 6,155 కరోనా కేసులు

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజే దేశ వ్యాప్తంగా కొత్తగా 6,155 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఒక్క రోజులో ఇన్ని కేసులు నమోదు కావడం గత 204 రోజుల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. గతేడాది సెప్టెంబర్‌ 16న 6,298 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 4,47,51,259కి చేరింది.

ప్రస్తుతం దేశంలో 31,194 క్రియాశీల కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 5.63 శాతానికి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 11 మంది వైరస్ వల్ల మృతి చెందారు. దాంతో, దేశంలో కరోనా మరణాల సంఖ్య 5,30,954కి చేరుకుంది. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో టెస్టుల సంఖ్య పెంచాలని, అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖా అన్ని రాష్ట్రాలకు హెచ్చరించింది.