నిజాం కళాశాల ముందు రాజగోపాల్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు

hyderabad youth congress fires on mla rajagopal reddy

కాంగ్రెస్ పార్టీ కి , తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి దిష్టి బొమ్మను నిజాం కళాశాల ముందు యూత్ కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేసారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల కలను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం సిగ్గుచేటని హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోత రోహిత్ మండిపడ్డారు. బీజేపీ పార్టీలో కనీస విలువ లేని ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీనీ, రేవంత్ రెడ్డిని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇంకోసారి రాజగోపాల్ రెడ్డి నోరు జారితే చెప్పు దెబ్బలు తప్పవని హెచ్చరించారు.

రాజగోపాల్ రాజీనామా తో మునుగోడు ఉపఎన్నిక అనివార్యమైంది. త్వరలోనే రాజగోపాల్ బిజెపి లో చేరబోతున్నాడనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మరోపక్క రాజగోపాల్ రాజీనామా ఫై కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయ్యింది. వరుసగా నేతలు రాజగోపాల్ ఫై విమర్శలు చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదే కాదు తాజాగా రాజగోపాల్‌ రెడ్డి మద్దతుదారులపై చర్యలు తీసుకుంది పార్టీ.

రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా ఉన్న నాలుగు మండలాల అధ్యక్షులు, ఓ టౌన్‌ అధ్యక్షుడిపై వేటు వేసింది. టీపీసీసీ ఆదేశాల మేరకు రాజగోపాల్‌ రెడ్డి మద్దతుదారులను తొలగించినట్లు వెల్లడించారు డీసీసీ అధ్యక్షుడు. చర్యలు తీసుకున్న వారిలో మునుగోడు- పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, చండూరు- పల్లె వెంకన్న, నాంపల్లి- పూల వెంకటయ్య, మర్రిగూడ- రాందాస్ శ్రీనివాస్ సహా ఓ టౌన్‌ అధ‍్యక్షుడున్నారు. ముందుగా ఆరుగురు మండలాధ్యక్షులపై చర్యలు తీసుకున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. చౌటుప్పల్- మోదుగుల రమేష్, సంస్థాన్ నారాయణ పురం- కరెంట్ శ్రీనివాస్‌లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదిలా ఉంటె రేవంత్ రెడ్డి రాజగోపాల్ ఫై చేస్తున్న వ్యాఖ్యలపై బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.