22న జీహెచ్ఎంసీ మేయర్ బాధ్యతల స్వీకరణ
Greater Hyderabad Mayor Vijayalakshmi
హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్గా టిఆర్ఎస్ సీనియర్ నేత, ఎంపీ కె.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి ఎన్నికయిన విషయం తెలిసిందే. అయితే విజయలక్ష్మి ఈనెల 22వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ రోజు మంచి ముహూర్తం ఉండటంతో బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు సిబ్బంది జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఏడో అంతస్తులో చాంబర్ను సిద్ధం చేస్తున్నారు. బంజారాహిల్స్ నుంచి విజయలక్ష్మి కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్గా ఎన్నికైన మోతె శ్రీలత తార్నాక డివిజన్ నుంచి గెలుపొందారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/