మల్టీస్టారర్ చిత్రానికి ‘సై’ బాలయ్య ..

అఖండ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న నందమూరి బాలకృష్ణ..ఇప్పుడు మల్టీస్టారర్ చిత్రానికి కూడా సై అంటున్నాడు. మంచి కథ వస్తే మల్టీస్టారర్ చిత్రాల్లో నటించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. బుధువారం విజయవాడ కనకదుర్గమ్మ ను బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి బాలకృష్ణ సంప్రదాయ దుస్తులతో వచ్చారు. స్వాగతం పలికిన ఆలయ అధికారులు, అర్చకులు.. ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

అఖండ ఘనవిజయం సాధించడం పట్ల బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. సనాతన ధర్మాన్ని చూపించిన సినిమా అఖండ అని అమ్మవారి ఆశీస్సులతో ప్రేక్షకులు విజయాన్ని అందించారని బాలకృష్ణ పేర్కొన్నారు. అఖండ విడుదలై ఘన విజయం సాధించాక ధైర్యం వచ్చిందన్న బాలకృష్ణ.. దర్శకులు ముందుకొచ్చి కథ నచ్చితే మల్టీస్టారర్‌ చేస్తానని తెలిపారు. అనంతరం మంగళగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. లక్ష్మీనరసింహస్వామివారికి.. బాలకృష్ణ, బోయపాటి శ్రీను పత్యేక పూజలు చేశారు.