దోస వేయలేదని భార్యను చంపిన భర్త

ఈ మధ్య చిన్న చిన్న వాటికీ చంపేయడం..చంపుకోవడం చేస్తున్నారు. తాజాగా తమిళనాడు లో భార్య దోస వేయలేదని చంపేశాడు ఓ భర్త. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా మాత్తూరుకు దగ్గర్లోని ఎన్​.మోటూరు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన గణేశన్ (60) పని ముగించుకొని ఇంటికి వచ్చాడు. ఆకలి వేయడంతో భార్య మాధమ్మాల్ (50)ను తనకు దోసె చేయాలని అడిగాడు. దీంతో ఆమె మూడు దోసెలు వేసింది. అనంతరం ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయింది. అయితే గణేశన్ మాత్రం తనకు మరో 3 దోసెలు కావాలని అడిగాడు. సిలిండర్​లో గ్యాస్ అయిపోందని మాధమ్మాల్ జవాబిచ్చింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన గణేశన్.. కత్తితో మాధమ్మాల్ తల, చేయి నరికేశాడు. దీన్ని అడ్డుకునేందుకు వెళ్లిన కోడలు విజయలక్ష్మి, చిన్నారి తానీషా (2) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ట్రీట్​మెంట్ కోసం కృష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మాత్తూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని.. గణేశన్​ను అరెస్ట్ చేశారు.