పంజాగుట్ట బాలిక మృతి కేసు : పోస్టుమార్టంలో సంచలన విషయాలు బయటపడ్డాయి

పంజాగుట్ట పీఎస్ పరిధిలోని నాలుగేళ్లున్న బాలిక అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన కేసుపై విషయంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. కడుపులో బలంగా తన్నడం వల్లే చనిపోయిందని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. దీంతో ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఓ మహిళ బాలికను తీసుకొచ్చి పడేసినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు.

దీంతో అనుమానాస్పద మృతి కేసును పోలీసులు హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేస్తున్నారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు బాలిక ఎవరన్నది ఇంకా తెలియరాలేదని, రాష్ట్ర వ్యాప్తంగా మిస్సింగ్‌ కేసుల వివరాలు పరిశీలిస్తున్నామని వెస్ట్‌జోన్ జాయింట్‌ కమిషనర్‌ ఏఆర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. రెండ్రోజుల్లోనే నిందితులను పట్టుకుంటామని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పీఎస్‌లకు బాలిక ఫోటో పంపించామని, సోషల్‌మీడియాలో కూడా పోస్ట్ చేశామని తెలిపారు.