మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా భారీగా పోస్టర్లు..

మునుగోడు నియోజకవర్గం లో రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిసాయి. ఫోనే పే తరహాలో కాంట్రాక్ట్ పే అంటూ కనిపిస్తున్న పోస్టర్లు స్థానిక ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి. చండూరులో రాత్రికి రాత్రి గోడలకు వేలాది పోస్టర్లను కొంతమంది అతికించారు. రూ.18 వేల కాంట్రాక్టు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికే కేటాయించడం జరిగిందంటూ BJP18THOUSANDCRORES అనే ట్రాన్సక్షన్ ఐడీని ఫోన్ పే తరహాలో పోస్టర్ లో ప్రింట్ చేశారు.

ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక ఫై అన్ని పార్టీలు ఫోకస్ చేసాయి. ఎలాగైనా ఈ ఉప ఎన్నిక లో గెలిచి సత్తా చాటాలని అధికపార్టీ టిఆర్ఎస్ తో పాటు బిజెపి , కాంగ్రెస్ పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం మొదలైంది. అన్ని పార్టీల నేతలు ప్రచారం తో హోరెత్తిస్తున్నారు. సోమవారం బిజెపి అభ్యర్థి గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఇదిలా ఉంటె సోమవారం రాత్రి చండూరులో కొంతమంది వ్యక్తలు రాజగోపాల్ రెడ్డి కి వ్యతిరేకంగా పోస్టర్లు అంటించడం ఇప్పుడు కలకలం రేపుతోంది.

ఫోనే పే తరహాలో కాంట్రాక్ట్ పే అంటూ దర్శనమిస్తున్న పోస్టర్లు స్థానిక ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి. చండూరులో రాత్రికి రాత్రి గోడలకు వేలాది పోస్టర్లను కొంతమంది అతికించారు. రూ.18 వేల కాంట్రాక్టు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికే కేటాయించడం జరిగిందంటూ BJP18THOUSANDCRORES అనే ట్రాన్సక్షన్ ఐడీని ఫోన్ పే తరహాలో పోస్టర్ లో ప్రింట్ చేశారు. 500 కోట్ల బోనస్ సంపాదించారంటూ పోస్టర్‌లో పొందుపర్చారు. ఈ పోస్టర్లు స్థానికంగా కలకలం రేపుతోన్నాయి. టీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ కు చెందిన నేతలే ఈ పోస్టర్లను ఏర్పాటు చేసి ఉంటారని బీజేపీ ఆరోపిస్తోంది.