మెగాస్టార్ ను అవమానించిన వారిని క్షమించే ప్రసక్తే లేదు – RGV

గత నాల్గు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి – గరికపాటి వివాదం నడుస్తుంది. ఇటీవల బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరంజీవి, గరికపాటి పాల్గొన్నారు. అక్కడి వచ్చిన వాళ్లు చిరంజీవితో ఫొటోలు దిగడానికి పోటీపడ్డారు. అయితే, చిరంజీవి ఫొటోలు దిగడం ఆపి వేదికపై కూర్చోకపోతే తాను నిర్మొహమాటంగా అక్కడి నుంచి వెళ్లిపోతానంటూ గరికపాటి అసహనం వ్యక్తం చేశారు. దీంతో మెగా అభిమానులతో పాటు చిత్రసీమ ప్రముఖులు సైతం చిరంజీవి అవమానించేలా గరికపాటి మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. గరికపాటి నోరు జారారు.. చివరికి క్షమాపణ కూడా చెప్పారు.. అయినప్పటికీ ఈ వివాదం మాత్రం ఆగడం లేదు. ఎవరొకరు దీనిపై మాట్లాడుతూనే ఉండడంతో ప్రతి రోజు అనేక మీడియా లలో ఇది చర్చ గా మారుతుంది.

తాజాగా రామ్ గోపాల్ సైతం ఎంట్రీ ఇచ్చారు. నేరుగా గరికపాటి పేరు వాడకుండా తన దైన శైలిలో వరుస ట్వీట్స్ తో విమర్శలు చేశారు. ‘ఐ యాం సారీ నాగబాబు గారు.. మెగాస్టార్‌ని అవమానించిన గుర్రం‌పాటిని క్షమించే ప్రసక్తే లేదు.. మా అభిమానుల దృష్టిలో చిరంజీవిని అవమానించిన వాడు మాకు గ(డ్డిప)రకతో సమానం, త్తగ్గేదెలె’ అని తేనె తుట్టిని కదిపారు.

‘హే గారికపీటి, బుల్లి బుల్లి ప్రవచనాల్లో నక్కి నక్కి దాక్కో, అంతే కాని పబ్లిసిటి కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మొరగొద్దు.. మెగాస్టార్ ఏనుగు.. నువ్వేంటో నీకు తెలివుందని అనుకుంటున్నావు కాబట్టి, నువ్వే తెలుసుకో’ అని ఓ ట్వీట్ చేశారు. ‘హే గూగురుపాటి నరసింహ రావు , తమరు గ(డ్డిప)రిక అయితే మా చిరంజీవి నరసింహ.. ఆ మిగిలిన రావుని మీ పంచ జేబులో పెట్టుకోండి. సర్ నాగబాబు గారు, మీ అన్నయ్యని, ఆ గడ్డి అన్న మాటలకి, దాన్ని తినెయ్యకుండ వదిలెయ్యడం మీ సంస్కారం.. కాని అభిమానులమైన మేము ఆ గ(డ్డిప)రికని మంటలలో మండించకపోతే ఆ గడ్డి నమ్మే అమ్మవారు కూడ మమ్మల్ని క్షమించరు. సర్ నాగబాబుగారు, ఆ గడ్డికి పద్మ కూడ ఎక్కువే, అలాంటప్పుడు పద్మశ్రీని ఎందుకు ఇచ్చారు సర్ .. సర్ సర్ సర్ చిరంజీవి ?’ అంటూ ఆర్జీవీ ట్వీట్లు చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ గా మారాయి.