ప్రపంచ సంస్థలతో అమూల్ పోటీ పడుతోంది : సీఎం జగన్
అమరావతి: అమూల్ ప్రపంచంతో పోటీ పడుతోందని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. అందులో భాగంగానే ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం నేడు అమూల్తో రాష్ట్ర ప్రభుత్వం సీఎం జగన్ సమక్షంలో ఒప్పందం చేసుకుంది. అమూల్ ఆధ్వర్యంలో బాలామృతం తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రపంచంలో అమూల్ ఎనిమిదవ స్థానంలో ఉంది. అమూల్ ప్రపంచంతో పోటీ పడుతోందన్నారు. వ్యవసాయానికి పాడి తోడైతే లాభసాటి అని సీఎం జగన్ వెల్లడించారు. పాలు పోసే రైతులే అమూల్ సంస్థకి యజమానులన్నారు సీఎం. అంగన్ వాడీ కేంద్రాలకు అమూల్ పాలు, బాలామృతం అందిస్తామన్నారు. అనంతపురం జిల్లాలో 85గ్రామాల్లో పాలవెల్లువ. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో పాల సేకరణ జరుగుతుందన్నారు సీఎం జగన్ అన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/