నేడు కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ

Telangana High Court
Telangana High Court

హైదరాబాద్: ఈరోజు హైకోర్టు తెలంగాణలో కరోనా పరిస్థితులపై విచారణ చేయనుంది. విచారణకు హాజరుకావాలని గతంలో సీఎస్‌కు హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. గత విచారణలో న్యాయస్థానం ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో జారీ చేసిన ఆదేశాలపై ప్రభుత్వం అమలు చేసిన వాటిపై గురువారం మరోసారి హైకోర్టు విచారించనుంది. ఐసీఎమ్మార్, డబ్ల్యూహెచ్‌వో గైడ్ లెన్స్‌ను తూచా తప్పక పాటించాలని ప్రభుత్వానికి హైకోర్టు అదేశించింది. ప్రతి రోజు కరోనా హెల్త్ బులిటెన్ తప్పులు లేకుండా ఇవ్వాలంది. కరోనా సమాచారాన్ని ప్రతి రోజు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం చేయాలని హైకోర్టు అదేశించింది. పేద వాళ్ళ కోసం ఫంక్షన్ హాల్స్, కమ్యూనిటీ సెంటర్స్, వెల్ఫైర్ అసోసియేషన్ సెంటర్స్‌ను వాడుకోవాలని ప్రభుత్వానికి న్యాయస్థానం సూచించింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/