భారత్‌లో కొత్తగా 64,531 కేసులు..1,092 మరణాలు

మొత్తం కేసులు 27,67,274..మొత్తం మరణాలు 52,889

corona virus- india

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. దేశంలో తాజాగా 64,531 మందికి కరోనా సోకిందని, అదే సమయంలో 1,092 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 27,67,274కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 52,889 కి పెరిగింది. ఇక 6,76,514 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 20,37,871 మంది కోలుకున్నారు. కాగా, నిన్నటి వరకు మొత్తం 3,17,42,782 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 8,01,518 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వివరించింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/