హైద‌రాబాద్‌లో గ్రిడ్ డైన‌మిక్స్ ఏర్పాటుకు సంసిద్ధ‌త‌ : కేటీఆర్

మంత్రి కేటీఆర్‌తో గ్రిడ్ డైన‌మిక్స్ సీఈఓ భేటీ


హైదరాబాద్: హైద‌రాబాద్‌లో మ‌రో అంత‌ర్జాతీయ ఐటీ సంస్థ కాలుమోపింది. అమెరికా స‌హా యూరోప్ వ్యాప్తంగా కార్య‌క‌లాపాలు సాగిస్తున్న డిజిట‌ల్ ట్రాన్స్‌ఫార్మేష‌న్ దిగ్గ‌జం గ్రిడ్ డైన‌మిక్స్ తాజాగా హైద‌రాబాద్‌లో త‌న కార్యాల‌యాన్ని ఏర్పాటు చేసేందుకు సంసిద్ధ‌త వ్య‌క్తం చేసింది.

ఈ మేర‌కు సోమ‌వారం గ్రిడ్ డైన‌మిక్స్ సీఈఓ లియోనార్డ్ లివ్‌సిజ్ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో స‌మావేశ‌మ‌య్యారు. భార‌త్‌లోనే త‌న తొలి కార్యాల‌యాన్ని హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ఈ సంద‌ర్భంగా లియోనార్డ్ తెలిపారు. ఈ ఏడాది చివ‌రి నాటికి 1,000 మంది ఉద్యోగుల‌తో కూడిన కార్యాల‌యాన్ని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/