తెలంగాణ పెండింగ్ బిల్లు..గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం
హైదరాబాద్: తెలంగాణలో పెండింగ్ బిల్లుల్లో మూడింటిని ఆమోదిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు బిల్లులను రాష్ట్రపతికి పంపారు. మరో రెండు బిల్లులను ప్రభుత్వానికి తిప్పిపంపించగా.. ఇంకో రెండు బిల్లులను మాత్రం పెండింగ్లోనే ఉంచారు. 2022 సెప్టెంబరు 14 నుంచి 2023 ఫిబ్రవరి 13 మధ్యకాలంలో 10 బిల్లులను పంపినా ఇంతవరకు గవర్నర్ ఆమోదముద్ర వేయలేదని తెలంగాణ ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.