కరోనా టీకా తీసుకున్న గవర్నర్
పుదుచ్చేరిలో వ్యాక్సిన్ అందించిన వైద్యులు
Hyderabad: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం పుదుచ్చేరిలో కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్నారు. పుదుచ్చేరిలోని రాజీవ్గాంధీ ప్రభుత్వ మహిళా, శిశువుల ఆస్పత్రికి వెళ్లిన తమిళిసై అక్కడ వైద్యులతో టీకా వేయించుకున్నారు. కరోనా కట్టడి కోసం ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని పిలుపు నిచ్చారు.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/