నేడు హన్మకొండ పర్యటనకు గవర్నర్ తమిళిసై

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌంద‌ర‌రాజ‌న్ నేడు హన్మకొండలో పర్యటించనున్నారు. కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రెండ్రోజుల‌పాటు జరగనున్న జాతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో గవర్నర్ పాల్గొననున్నారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగే ఈ ఉత్సవాలను ఆమె ఇవ్వాల (మంగ‌ళ‌వారం) ప్రారంభించనున్నారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షత వహించనున్న‌ట్టు స‌మాచారం.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/