టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, సభ్యుల రాజీనామాలకు గవర్నర్‌ ఆమోదం

TSPSC

హైదరాబాద్‌ : టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, ఐదుగురు సభ్యుల రాజీనామాలను గవర్నర్‌ తమిళి సై బుధవారం ఆమోదించారు. గత సంవత్సరం డిసెంబర్‌లో టీఎస్‌పీఎస్‌ చైర్మన్ బి.జనార్ధన్‌రెడ్డి రాజీనామా చేశారు. కాగా, టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల రాజీనామాలను వెంటనే ఆమోదించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. ఆ మేరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను ఆయన లేఖ రాశారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, సభ్యుల రాజీనామాలు చేసి నెల రోజులు గడుస్తున్నా.. గవర్నర్ వాటిని ఇంత వరకు ఆమోదించడం లేదని అన్నారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ లేకపోవడంతో ఉద్యోగాల భర్తీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నామని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ బుధవారం టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, సభ్యుల రాజీనామాలకు ఆమోదం తెలిపింది.