శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ.2.9కోట్ల విలువైన బంగారం పట్టివేత

Gold worth Rs 2.9 crore seized at Shamshabad airport

హైదరాబాద్‌ః శంషాబాద్‌లోని రాజీవ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు సీజ్‌ చేశారు. విమానాల్లో దుబాయి నుంచి వచ్చిన వ్యక్తుల నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇద్దరు మహిళల వద్ద 1865.2 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుకున్న బంగారం రూ.1.18కోట్ల విలువ ఉంటుందని పేర్కొన్నారు. 16 బంగారు బిస్కెట్లను తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. మరో వ్యక్తి నుంచి 1,100 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్‌ చెప్పింది. ఈ బంగారం విలువ రూ.69.85లక్షలు ఉంటుందని చెప్పింది. ఈ నెల 30న మహిళ నుంచి 1,632 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని దాని విలువ రూ.1.03కోట్ల ఉంటుందని కస్టమ్స్ వివరించింది.