మానకొండూరులో అర్ధరాత్రి కాల్పుల కలకలం

gangwar-in-manakonduru

కరీంనగర్ జిల్లాలోని మానకొండూరులో అర్ధరాత్రి కాల్పుల కలకలం రేపాయి. అరుణ్ అనే వ్యక్తిపై నలుగురు వ్యక్తులు గన్ తో కాల్పులు జరిపారు. గన్ మిస్ ఫైర్ కావడంతో అరుణ్ తప్పించుకున్నారు. అయితే ఆయన కూతురు వైష్ణవికి గాయాలు అయ్యాయి. రౌడీ గ్యాంగ్ నుంచి తప్పించుకుని దగ్గర్లోని ఓ ఇంటికి చేరుకుని అరుణ్ ప్రాణాలు కాపాడుకున్నారు. అయినా దుండగులు విడిచి పెట్టలేదు. అరుణ్ తలదాచుకున్న ఇంట్లోకి వెళ్లి వారిని చితకబాదారు. గొడవకు ఎలాంటి సబంధం లేని వారి ఇంట్లో సామాగ్రి ధ్వంసం చేశారు.

అరుణ్ పై దాడి చేసిన వారిలో ఇద్దరిని పట్టుకొని స్థానికులు పోలీసులకు అప్పగించారు. అతన్ని చంపేందుకు వచ్చిన దుండగల్లో ఒకరు తుపాకీతో బెదిరించినట్లుగా స్థానికులు చెబుతున్నారు. గతంలో ఆరుణ్ పై కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటు నమోదు అయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మానకొండూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్లుగా తెలిపారు. నిందితులకు నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాల్పులతో మానుకొండూరులో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.