మూడు నెలల పాటు గచ్చిబౌలి టు కొండాపూర్ రోడ్ బంద్
నగరవాసులకు అలర్ట్ జారీ చేసారు ట్రాఫిక్ అధికారులు. మూడు నెలల పాటు గచ్చిబౌలి టు కొండాపూర్ రోడ్ బంద్ చేస్తున్నట్లు తెలిపారు. గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు కొత్త ఫ్లైవోవర్ను నిర్మిస్తున్న నేపథ్యంలో ఈనెల 13నుంచి మూడు నెలల పాటు మూసివేస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ నాయక్ వెల్లడించారు. దీనిని దృష్టిలో పెట్టుకొని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ఆయన సూచించారు.
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో శిల్పాలేఅవుట్ ఫ్లైవోవర్ రెండోదశ నిర్మాణ పనుల నేపథ్యంలో గచ్చిబౌలి జంక్షన్ నుంచి కొండాపూర్ వెళ్లే రహదారిపై ఈనెల 13వ తేదీ నుంచి 90 రోజుల పాటు వాహనాలను దారి మళ్లించడం జరుగుతుందని తెలిపారు. గచ్చిబౌలి జంక్షన్ టు కొండాపూర్ వైపు వెళ్లే మార్గాన్ని పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.