వ్యాపార సంస్థలకు ఉచితంగా ప్రచారం చేస్తా
షాహిద్ ఆఫ్రీదీ బంపర్ ఆఫర్

ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది వ్యాపార సంస్థలకు ఒక ఆఫర్ ను ప్రకటించాడు. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి తన ఫౌండేషన్ ద్వారా అండగా ఉంటున్నాడు. వారికి కావాలసిన నిత్యవసరాలను ఉచితంగా అందిస్తున్నాడు. ఈ ఈ నేపథ్యంలో వ్యాపార సంస్థలకు ఉచితంగా ప్రచార కర్తగా పనిచేస్తానని, అందుకు తన ఫౌండేషన్కు బియ్యం నిధులు సమకూర్చాలని కోరాడు. ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను పోస్టుచేసి పలు బ్రాండ్లకు విజ్ఞప్తి చేశాడు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/