స్వీయ నిర్బంధంలో ఆస్ట్రేలియా మాజీ పేసర్
కరోనా ప్రభావం.. జాసన్ గిలెస్పీ
సిడ్నీ: నేడు ప్రపంచ దేశాలు కరోనా మహామ్మారి బారిన పడి విలవిలలాడుతున్నాయి. మందు లేని దీనికి కేవలం నివారణ ఒక్కటే మార్గం కావడంతో ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా విదేశి ప్రయాణం చేసిన వారెవరైనా సరే స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆదేశిస్తున్నాయి. దీంతో విదేశి ప్రయాణం చేసిన వారు అందరూ స్వీయ నిర్బందంలోకి వెళ్ళిపోతున్నారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ పేసర్ జాసన్ గిలెస్పీ కూడా విదేశి ప్రయాణం చేసి స్వదేశానికి రావడంతో వెంటనే స్వీయనిర్బంధంలోకి వెళ్ళాడు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/