నేడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు తొలి రైలు
లాక్డౌన్ అనంతరం తొలిసారి..రైలులో 200 మంది తెలంగాణ వాసులు
హైదరాబాద్: కరోనా లాక్డౌన్ తర్వాత ఈరోజు మొదటిసారిగా ప్రయాణికుల రైలు సికింద్రాబాద్కు రానుంది. రాత్రి 8:30 గంటలకు కేఎస్ఆర్ బెంగళూరు స్టేషన్లో బయలుదేరిన బెంగళూరు ఢిల్లీ (రాజధాని) ఏసీ సూపర్ ఫాస్ట్ రైలు మరికాసేపట్లో సికింద్రాబాద్ చేరుకోనుంది. అనంతరం బయలుదేరి రేపు తెల్లవారుజామున ఢిల్లీ చేరుకుంటుంది. కాగా, లాక్డౌన్ కారణంగా బెంగళూరులో చిక్కుకుపోయిన దాదాపు 200 మంది తెలంగాణవాసులు ఈ రైలులో సికింద్రాబాద్ చేరుకోనున్నారు. అలాగే, తెలంగాణలో చిక్కుకుపోయిన దాదాపు 300 మంది ప్రయాణికులు ఢిల్లీ వైపుగా ప్రయాణించనున్నారు. మరోపక్క, ఢిల్లీలో నిన్న రాత్రి 9:15 గంటలకు బయలుదేరిన మరో రైలు నేటి సాయంత్రం సికింద్రాబాద్ చేరుకోనున్నట్టు అధికారులు తెలిపారు.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/