వన్‌ నేషన్ వన్‌ ఎలక్షన్ పై నేడు కమిటీ తొలి సమావేశం

First official meet of ‘One Nation, One Election’ panel likely today; Kovind to chair

న్యూఢిల్లీ: దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంపై సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ తొలి అధికారిక సమావేశం ఈరోజు జరునున్నట్లు సమాచారం. కమిటీ చైర్మన్‌ రామ్‌నాథ్‌ కోవింద్‌ నివాసంలోనే ఈ సమావేశం నిర్వహించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

కాగా, దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణపై గత కొంతకాలంగా చర్చ జరుగుతూ వస్తున్నది. జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు జమిలి ఎన్నికలతో ప్రయోజనాలు ఉన్నాయంటే, ఇంకొందరేమో జమిలి ఎన్నికలతో ఒరిగేదేమీ లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికల నిర్వహణపై ఓ క్లారిటీ కోసం కమిటీని నియమించింది.