ప్రభాస్ ఫ్యాన్స్ అత్యుత్సాహం వల్ల థియేటర్ కాలిపోయింది

ఫ్యాన్స్ అత్యుత్సాహం వల్ల థియేటర్ కాలిపోయిన ఘటన వెస్ట్ గోదావ‌రి జిల్లాలోని తాడేప‌ల్లి గూడెం వెంక‌ట్రామ థియేట‌ర్‌లో చోటుచేసుకుంది. ప్రభాస్ పుట్టిన రోజు సందర్బంగా ప్రభాస్ నటించిన బిల్లా చిత్రాన్ని 4k వెర్షన్ లో ఈరోజు రిలీజ్ చేసారు. ఈ నేపథ్యంలో సినిమాను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు థియేటర్ కు చేరుకున్నారు. అభిమాన హీరో చూడగానే వారిలో ఆనందం రెట్టింపు అయ్యింది. కొంద‌రు ప్ర‌భాస్ ఫ్యాన్స్ అత్యుత్సాహంతో థియేట‌ర్‌లోనే బాణా సంచా కాల్చారు. దాంతో థియేట‌ర్‌లో మంట‌లు చేల‌రేగాయి. కొన్ని సీట్లు పాక్షికంగా కాలిపోయాయి.

దీంతో థియేట‌ర్‌ అంత పొగ‌లు వ్యాప్తించాయి. ఏంజరుగుతుందో తెలియక ప్రాణ భ‌యంతో థియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. ప్రాణ హాని లేకపోయినప్పటికీ , థియేటర్ కు భారీగా ఆస్థి నష్టం వాటిల్లిందని యాజమాన్యం చెప్పుకొచ్చారు. మరోపక్క హైదరాబాద్‌లో దేవి థియేటర్‌లో ప్రదర్శించిన బిల్లా స్పెషల్ షోకి దర్శకుడు మెహర్ రమేష్, ప్రభాస్ చెల్లెలు ప్రశీద హాజరయ్యారు. తన తండ్రి ని, ప్రభాస్‌ని మళ్లీ తెరపై చూస్తుంటే చాలా హ్యాపీగా ఎమోషనల్‌గా ఉందని ఆమె అన్నారు.