16న గ్రామీణ భారత్‌బంద్‌కు పిలుపునిచ్చిన రైతు సంఘాలు

Farmers announce nationwide protest on 16 Feb. Banks, offices shut on Friday

న్యూఢిల్లీ: కనీస మద్దతు ధరకి చట్టబద్ధతతోపాటు పలు డిమాండ్ల సాధన కోసం దేశ రాజధాని ఢిల్లీని ముట్టడించిన రైతులు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. ఈ నెల 16న గ్రామీణ భారత్‌బంద్‌కు పిలుపునిచ్చారు. తమ సమస్యలను ప్రజలకు వివరించి, కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకే భారత్‌బంద్‌కు పిలుపునిచ్చినట్టు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) ప్రకటించింది. ఈ బంద్‌కు పలు కేంద్ర కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. 16న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంద్‌ కొనసాగుతుందని రైతు సంఘాల నేతలు ప్రకటించారు. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జాతీయ రహదారులను స్తంభింపజేస్తామని తెలిపారు.