టీడీపీకి తలనొప్పిగా మారిన ఫేక్ ట్వీట్స్

టీడీపీ పార్టీ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటుందనే సంగతి తెలిసిందే. ప్రజా సమస్యల ఫై ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి సూచిస్తునే , ప్రజల పక్షాన నడుస్తూ వస్తుంది. అలాంటి టీడీపీ కి ఇప్పుడు ఫేక్ ట్వీట్స్ తలనొప్పిగా మారాయి. గత కొద్దీ రోజులుగా టీడీపీ పేరుతో ప్రెస్ నోట్లు , ట్వీట్స్ వైరల్ అవుతూ వస్తున్నాయి. వీటిపై తీరా ఆరా తీస్తే అవి ఫేక్ అని తేలుతోంది. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేరుతో మరో ఫేక్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీడీపీ అధికారంలోకి రాగానే సచివాలయం, వాలంటీర్ వ్యవస్థలను రద్దు చేస్తామన్నది ట్వీట్ సారాంశంగా ఉంది.

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నేను ముఖ్యమంత్రి పదవి చేపట్టి, ఈ జగన్‌ రెడ్డి సృష్టించిన వాలంటీర్‌ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను రద్దు చేస్తాం. మళ్లీ జన్మభూమి కమిటీ ద్వారా నియామకాలు ఉంటాయి’అంటూ ట్వీట్‌లో ఉంది. ఈ ట్వీట్ కొద్దిరోజులుగా వైరల్ అవుతోంది. దీంతో మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. ఇలా వరుసగా సోషల్ మీడియాలో టీడీపీ ప్రెస్‌నోట్‌లు, ట్వీట్‌లు వైరల్ కావడంతో తెలుగు తమ్ముళ్లు షాక్ అవుతున్నారు. టీడీపీని టార్గెట్ చేస్తూ కొద్దిరోజులుగా ఇలా ఫేక్ ప్రెస్‌నోట్‌లు, ట్వీట్‌లతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పుడు ఏకంగా వాలంటీర్, సచివాలయ వ్యవస్థను రద్దు చేస్తారంటూ ప్రచారం చేయడం..వైసీపీ నేతలు సైతం దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లడం తో టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఎవరు ఈ ఫేక్ న్యూస్ ను ప్రచారం చేస్తున్నారనేదానిపై నిఘా పెట్టారు.