దేశవ్యాప్తంగా వివో సంస్థలపై ఈడీ దాడులు

న్యూఢిల్లీః దేశవ్యాప్తంగా వివో మొబైల్ కంపెనీ సహా పలు చైనీస్ సంస్థలపై ఈడీ దాడులు చేపట్టింది. దాదాపు 44 చోట్ల ఈడీ దాడులు జరుపుతున్నట్లు అధికార వర్గాలు తెలిపింది. మనీలాండరింగ్ కేసులో భాగంగా ఈ దాడులు చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. బిహార్, ఝార్ఖండ్, యూపీ, మధ్యప్రదేశ్, హిమాచల్ప్రదేశ్, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ఇదివరకు నమోదైన కేసులతో పాటు మరో కొత్త కేసును ఈడీ నమోదు చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే తాజా దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. వివో సహా అనుబంధ సంస్థలపై సోదాలు చేస్తున్నట్లు అధికరాలు తెలిపారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/