మాజీ డీజీపీ అంజనీకుమార్ సస్పెన్స్ను ఎత్తేసిన ఈసీ
మాజీ డీజీపీ అంజనీకుమార్ బిగ్ రిలీఫ్ దొరికింది. డీజీపీ హోదాలో ఉంటూ ఎన్నికల ఫలితాల రోజున కాంగ్రెస్ లీడర్లను కలిశారని అంజనీకుమార్పై సస్పెన్స్ వేటు వేసింది ఎన్నికల సంఘం. ఇప్పుడు ఆ సస్పెన్స్ ను ఎత్తివేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.
ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో రేవంత్ రెడ్డిని కలిసి ప్రమాణ స్వీకారంపై చర్చించడంతో డీజీపీపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవంత్ రెడ్డిని కలవడంపై అంజనీ కుమార్ను ఈసీ వివరణ కోరింది. ఆయన్ని సస్పెండ్ చేసింది. అంజనీ కుమార్ స్థానంలో రవి గుప్తాను తెలంగాణ డీజీపీగా నియమించింది. మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూస్తానని కేంద్ర ఎన్నికల సంఘానికి అంజనీకుమార్ వివరణ ఇచ్చారు. ఆయన వివరణతో సంతృప్తి వ్యక్తం చేసిన ఈసీ సస్పెన్స్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.