ఇండోనేషియాలో భూకంపం

Richter scale graph
Richter scale graph

జకార్తా: శుక్రవారం ఉదయం ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. ఇండోనేషియాలోని శామ్ లకీ ప్రాంతానికి 229 కిలోమీటర్ల దూరంలో శుక్రవారం తెల్లవారుజామున భూకంపం వచ్చిందని ఇండోనేషియా అధికారులు చెప్పారు. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4 గా నమోదైందని అధికారులు చెప్పారు. 157 కిలోమీటర్ల లోతులో వచ్చిన భూప్రకంపనలతో ప్రజలు ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూప్రకంపనలతో ఎంత ఆస్తినష్టం జరిగిందో ఇంకా తెలియరాలేదు. భూకంపాలకు నిలయమైన ఇండోనేషియాలో ప్రజలు శుక్రవారం నాటి భూప్రకంపనలతో భయాందోళనలు చెందుతున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/