మూడు రాజధానులను సీపీఐ వ్యతిరేకిస్తోంది
దేశంలో ఎక్కడా మూడు రాజధానులు లేవు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని సీపీఐ వ్యతిరేకిస్తోందని సీపీఐ నేత డి. రాజా అన్నారు. దేశంలో ఏక్కడ మూడు రాజధానులు లేవని అన్నారు. ముఖ్యమంత్రి జగన్కు ఎవరు సలహాలు ఇస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. కాగా నేడు అమరావతి జేఏసీ నేతలు సీపీఐ నేతలు డి.రాజా, రామకృష్ణను కలిశారు. అనంతరం మీడియాతో రాజా మాట్లాడుతూ..అమరావతిలోనే రాజధాని ఉండాలని డిమాండ్ చేశారు. జేఏసీ నేతలతో కలిసి రాజధాని కోసం పోరాడుతామని తెలిపారు. అమరావతి ఉద్యమాన్ని ఢిల్లీ స్థాయికి తీసుకెళ్తామన్నారు. ఉద్యమకారులపై తప్పుడు కేసులు పెట్టి వేధించడం సరికాదని రాజా పేర్కొన్నారు. అనంతరం రామకృష్ట మాట్లాడుతూ..మూడు రాజధానుల పేరుతో జగన్ ఇప్పటికే తప్పు చేశారన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/